కృష్ణశాస్త్రి, భావ కవిత్వం, ఆకులో ఆకునై (కృష్ణపక్షం)
Krishnasastri, bhaava kavitvam, aakulo aakunai (krishnapaksham)
రచయిత: దేవులపల్లి కృష్ణశాస్త్రి
రచన: కృష్ణపక్షం (first published in 1925)
కవిత: ఆకులో ఆకునై
ఆకులో ఆకునై.. పూవులో పూవునై…
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై…(నును లేత - very tender)
ఈ అడవి దాగిపోనా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు (ruby-hued tender leaf) తెరచాటు తేటినై (తేటి = తేనెటీగ )
పరువంపు విరిచేడే (adolescent) చిన్నారి (girl) సిగ్గునై
ఈ అడవి దాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
(చదలు = ఆకాశం, జలద = జలమును ధరుంచునది = మేఘం)
ఆకలా.. దాహమా.. చింతలా.. వంతలా (వంత = grief, pain, sorrow)
ఈ కరణి (విధంగా) వెర్రినై ఏకతమా (alone) తిరుగాడా
ఈ అడవి దాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
How I found it?
యాదృచ్చికంగా గోరేటి వెంకన్న పాడిన ‘ఓ నల్ల తుమ్మ’ పాట youtube లో నచ్చి అనేక సార్లు వినినప్పుడు ఆ పాట మధ్యలో ఆయన తనకి నచ్చిన , గురు సమానులైన కృష్ణశాస్త్రి గారి మీద తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ, అలాగే తన కవిత్వం లో కృష్ణశాస్త్రి ప్రభావాన్ని తెలియజేస్తూ, కృష్ణపక్షం లోని ‘యెలదేటి చిరుపాట’ అని పద్యాన్ని పాడారు. ఆ context లో ఆ కవితను అలా వినినప్పుడు, దాని మీద ఉత్సుకత యేర్పడింది. అలా కృష్ణపక్షం చదవటం మొదలుపెట్టాను. కృష్ణపక్షం లోని ‘ఆకులో ఆకునై’ అన్న మొదటి కవిత, సినిమా లో పాటగా ఎన్నో సార్లు వినినదే అయినా, దాని అంతరార్థం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. Internet లో కూడా కృష్ణశాస్త్రి కవిత్వం గురించిన meta-analysis ఎక్కువగా ఉన్నట్టు అనిపించలేదు. శ్రీ శ్రీ మహాప్రస్థానం మీద చాలా పోస్ట్స్ కనిపిస్తాయి. అదృష్టవశాత్తు, Youtube లో IAS training కోసం ఉన్న ‘aasayam telugu literature’ అనే channel లో ఒక సుదీర్ఘ video దొరికింది. ఈ పోస్టులో ఉన్న చాలా విషయాలు ఆ video నుండి నేను నేర్చుకున్నది. వారికి నా కృతజ్ఞతలు. ఈ short video by ajagava కూడా చూడండి.
కృష్ణపక్షం వ్రాసి 100 సంవత్సరాలు అవుతూ ఉన్నా, 2022 లో సింగాపుర్ లో ఉంటున్నmillenneal engineer కి , కృష్ణశాస్త్రి కవిత్వం మొదటి సారి చదివినప్పుడు కొంత అర్థం అయ్యి, ఇంకొంచెం అనుభూతిలోకి రావటం వింతగానే అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎన్నో సార్లు కృష్ణశాస్త్రి, కృష్ణపక్షం గురించి విన్నా కూడా యెప్పుడూ చదవాలనిపించలేదు. ఇందులోని ఇంకా కొన్ని కవితలను తరువాత post చేస్తాను.
‘కృష్ణపక్షం’ అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్న 14 రోజులు (waning moon) i.e., the journey into darkness. భౌతికంగా కృశించిపోవటానికి ఇది ప్రతీక.
ఆకులో ఆకునై is the first poem composed for the book కృష్ణపక్షం - his first book on a collection of poems, followed by ప్రవాసం and ఊర్వశి. He discussed this poem with నండూరి సుబ్బారావు (famous for his work యెంకి పాటలు) at సామర్లకోట railway station.
కృష్ణశాస్త్రి గురుంచి:
దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980) తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్త్రి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని ఆయన రచనా పరంపర కొనసాగింది. ఆయన కి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు.
కృష్ణశాస్త్రి గురించి ప్రముఖుల మాటల్లో-
విశ్వనాథ సత్యనారాయణ - మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.
మహాకవి శ్రీశ్రీ - నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని.
సి. నారాయణ రెడ్డి – కృష్ణశాస్త్రి ఒక గంధర్వ గీతం. నిశ్వాస పారిజాతం. పదశిల్ప విరించి. పాటల పరమేశ్వరుడు. భావుకటా పట్టభద్రుడు. వేదనా మందాకిని. ఆయన స్పర్శ తో ప్రాణం గానమయ్యింది. పదం శిల్పం అయ్యింది. వాలాహక (=మెరుపు) ఘోష వాక్యం లో ఇమిదింది. సాగరం అక్షరంలోకి చొరబడింది.
పిబి శ్రీనివాస్ – కృష్ణశాస్త్రి నీదు కృష్ణపక్షమందు, శుక్లపక్ష శోభ చులకనయ్యె.
వేటూరి సుందర రామమూర్తి – కృష్ణశాస్త్రి మరణించాడని బాధ పడను. కోకిల మూగదైపోయింది, వసంతం వల్లకాటికి వెళ్లిపోయింది. (అవి బాధపడాలి కానీ, నేను ఎందుకు అని అర్థం).
కృష్ణశాస్త్రి, తన బాధని ప్రపంచం బాధగా పలికిస్తే (కృష్ణపక్షం లో), శ్రీ శ్రీ ప్రపంచం బాధని తన బాధగా ప్రకటించాడు (మహాప్రస్థానంలో).
కృష్ణ పక్షము కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన 1920 లో (23 సం. వయస్సులో)బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా నల్లమల కొండలు, చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
The works of krishnasastri have been influenced by his times and experiences including – Rabindranath Tagore, time between two world wars, Indian freedom movement taking shape, involvement in Brahmo Samaj activities, social reformation activities, English literature on Romanticism.
భావ కవిత్వము గురించి:
భావ కవిత్వము (Lyrical poetry) నకు తత్త్వదృష్టిలో (philosophical view) మాతృక (origin) కాల్పనిక కవిత్వం (Romantic poetry). దీనిని ఆంగ్లములో lyrical poetry అన్నారు. లైర్ (Lyre) అనే వాద్య విశేషముతో పాడే కవిత కావున దీనికి ఆ పేరు వచ్చినది. కవితా ఉద్యమాల పరిణామక్రమం లో ఆధునిక కవిత్వానికి (గురజాడ అప్పరావు, కందుకూరి వీరేశలింగం, రాయప్రోలు సుబ్బారావు, కట్టమంచి రామలింగారెడ్డి), విప్లవ/అభ్యుదయ కవిత్వానికి (శ్రీ శ్రీ ) మధ్య ఉన్న కాలాన భావకవిత్వం విరాజిల్లిందని చెప్పవచ్చు.
This poem falls in the category of romanticism (భావకవిత్వం), inspired by the works of lyrical ballads by Shelly, Keats etc. Some of the main qualities of romanticism or romantic poetry are:
subjectivity (ఆత్మాశ్రయత్వం)
the love of the supernatural (భౌతికాతీత ప్రయత్నం)
melancholy (not tragedy) (విషాదం)
love of nature (ప్రకృతి మీద ప్రేమ)
humanity (మానవత్వం/మానవతావాదం)
pompous/vain display of protest (ఆడంబర నిరసన)
వస్తుభావ రచనలలో భావానికి ప్రాధాన్యతని ఇస్తుంది భావకవిత్వం. భావకవిత్వ లక్షణాలను సినారె ఈ విధంగా విభజించారు. 1. ప్రణయం-ఊహ-విరహం-వేదన 2. ప్రకృతి 3. భక్తి 4. దేశభక్తి 5. సంఘ సంస్కరణ 6. స్మృతి
మరి కొన్ని లక్షణాలు : స్వేచ్ఛా ప్రియత్వం, మార్మికత, స్త్రీ ఉదాత్త చిత్రణ , సామాజిక స్పృహ.
Analysis of ‘ఆకులో ఆకునై’:
‘ఆకులో ఆకునై’ కవిత రచయిత యొక్క తన్మయత్వాన్ని సూచిస్తుంది. ప్రకృతి లో ఏకం కావాలనే తన ప్రబల కాంక్షను ప్రతిబింబిస్తుంది.
ఈ కవితలో, నిజజీవిత వాస్తవిక బాధల నుండి విముక్తి పొంది ప్రకృతి సౌందర్యంలో కలిసిపోవాలనే ఊహ కాల్పనికం. అలా జరగడం సాధ్యం కాదు కానీ ఆ స్వేచ్చ, ఆ సౌందర్యానుభవం అలా జరిగితే ఎంత బాగుంటుంది అని పాఠకుడికి అనిపించి భావ తాదాత్మ్యాన్ని పొందుతాడు.
అనుప్రాస వలన లాలిత్యం, విడి పదాల వలన కోమలత్వం చేకూరి భావానికి పుష్టి కలిగిస్తాయి. తీగలా సాగే భావ వాక్య విన్యాసం శృంఖలా (chain/ connection) లక్షణం కలిగి భావ తదాత్మ్యానికి లోను చేస్తుంది. ఇది అసాధారణ కాల్పనికోక్తి.
ప్రకృతి పైన తన అభిమానం అందులో తను కలిసిపోవాలనుకునేంత ఉంది కవికి. ఆ కాంక్షను వ్యక్త పరుస్తున్నాడు. ఇందులో తన్మయత్వం, ఆత్మాశ్రయత్వం, అంతర్ముఖత దాగున్నాయి.
References:
Wikipedia
Aasayam telugu literature - youtube channel